ప్రేక్షకులందరికీ ఉర్రూతలూగించే మాస్ సాంగ్ అయినా.అందరినీ ప్రేమలోకంలో తేలి ఆడించే మెలోడీ సాంగ్ అయినా.
చిన్న పెద్ద అందరిని చిందులేసేలా చేసే ఫోక్ సాంగ్ అయినా.ఇలా ఎలాంటి సాంగ్ అయినా సరే తనదైన శైలిలో అద్భుతంగా కంపోజ్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు దేవిశ్రీప్రసాద్.
కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు తన టాలెంట్ తో రాక్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దేవిశ్రీప్రసాద్.
ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ ఎంతో అద్భుతమైన ఆల్బమ్స్ అందించి ప్రేక్షకులందరినీ మెప్పించాడు.ఇక స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకూ ఎన్నో సినిమాలకు మ్యూజిక్ అందించి టాలీవుడ్ లో ఎన్నో ఎవర్గ్రీన్ సాంగ్స్ ని కంపోజ్ చేసాడు దేవి శ్రీ ప్రసాద్.
ఇక ఇటీవలే పుష్ప అనే పాన్ ఇండియా మూవీ లో తనదైన శైలిలో మ్యూజిక్ అదరగొట్టాడు.ఒక రకంగా చెప్పాలంటే పుష్ప అదిరిపోయే విజయం సాధించడానికి పుష్ప సినిమాలోని పాటలు కూడా ఒక కారణం అని చెప్పాలి.
పుష్ప సినిమాలోని శ్రీవల్లి, ఊ అంటావా ఉహూ అంటావా, దాక్కో దాక్కో మేక అనే పాటలు అందరిని అలరించడమే కాదు యూట్యుబ్లో సంచలన రికార్డులు కూడా కొల్లగొట్టాయి.ఇక ఇటీవల పుష్ప సినిమాతో హిట్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఇప్పుడు పవన్ తో కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ ప్రేక్షకులను అలరించాయి.ఇక ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ ఎంపికయ్యాడట.ఇకపోతే ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేశాడట.
గతంలో ఒక సినిమాకి మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేవాడట.దేవిశ్రీప్రసాద్.కానీ పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి మాత్రం ఐదు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో అటు హీరోలే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా హిట్ వస్తే రేటు పెంచుతున్నారు అని అర్థమవుతుంది.