దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త వారం రోజుల క్రితం ఒకటి వచ్చి హల్చల్ సృష్టించిన విషయం తెల్సిందే.దేవిశ్రీ ప్రసాద్ నటి పూజిత పొన్నాడను వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది.
గత కొంత కాలంగా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో పుకార్లు పుట్టుకు వచ్చాయి.ఈ వార్తలు కాస్త సీరియస్గా రావడంతో అంతా కూడా నిజంగానే దేవిశ్రీ ప్రసాద్ ఒక ఇంటి వాడు కాబోతున్నాడేమో అనుకున్నారు.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అవన్ని పుకార్లేనట.
పూజిత పొన్నాడకు ఎప్పుడో పెళ్లి అయ్యిందట.అర్జున్ కళ్యాణ్ అనే వ్యక్తితో పూజిత వివాహం అయ్యింది, ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటున్నారు.మరి ఇలాంటి సమయంలో దేవిశ్రీ ప్రసాద్తో ఆమె పెళ్లి ఎలా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, పూజిత ఈ విషయమై క్లారిటీ ఇస్తూ అవన్ని పుకార్లే అంటూ తేల్చి చెప్పింది.
దేవిశ్రీ ప్రసాద్తో తనకు పరిచయం కూడా లేదు అంటూ పూజిత చెప్పుకొచ్చింది.షార్ట్ ఫిల్మ్స్తో పాటు సినిమాల్లో కూడా నటిస్తూ ఇప్పుడిప్పుడే కెరీర్ను బిల్డ్ చేసుకుంటున్న పూజితకు ఈ పుకార్లు షాక్ ఇచ్చాయట.
దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి జనాల్లో ఉన్న క్యూరియాసిటీ ఏ స్థాయిలో ఉందో తాజాగా వచ్చిన పుకార్లతో తేలిపోయింది.పెద్ద ఎత్తున పుకార్లకు జనాలు స్పందించారు.సినీ జనాలు కూడా ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించారు అంటే దేవిశ్రీ పెళ్లి కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సరే ఈ వార్తలు పుకార్లే కాని, దేవిశ్రీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
దేవిశ్రీ ఈ విషయమై స్పందించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.