సైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప.ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మరోసారి అదిరిపోయే నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.సరైన సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.పరిస్థితులు చక్కబడితే కానీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యేలా లేదు.
అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.ఇప్పటికే మొదటి భాగం దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది.
ఈ సినిమాలో అదిరిపోయే స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టు ఇప్పటికే తెలుసు.
ఈ స్పెషల్ సాంగ్ కు దేవి శ్రీ ప్రసాద్ ఆడిపోయే రేంజ్ లో మంచి ట్యూన్ అందించాడని వార్తలు వస్తున్నాయి.ఈ సాంగ్ ఇప్పటికే రెడీ అయ్యిందని తెలుస్తుంది.ఈ సాంగ్ జానపద నేపథ్యంలో సాగే పక్కా మాస్ సాంగ్ అని మాస్ అంశాలు అన్ని ఈ సాంగ్ లో ఉండనున్నాయని తెలుస్తుంది.
ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఆడిపాడనుందని తెలిసిందే.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు చాలా సమయం కేటాయించి మరి ట్యూన్స్ ఇచ్చాడట.
అందుకే ఈ ట్యూన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నాయని తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను దసరా టైం కు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.
రెండవ పార్ట్ ను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్లాన్ చేస్తునట్టు సమాచారం.