విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.ఆశ్వయుజ శుద్ధ దశమి పురస్కరించుకొని.
శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా అమ్మవారు నేడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతితో ఉత్సవాలు లాంఛనంగా ముగించనున్నారు.
అదేవిధంగా సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి తెప్పోత్సవాన్ని ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.అయితే కృష్ణా నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉన్న కారణం చేత స్వామి అమ్మవార్ల నడివిహారానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
నేడు ఆఖరి రోజు పురస్కరించుకొని భక్తులందరికీ కనకదుర్గమ్మ దర్శనాన్ని ఉచితంగా కల్పించనున్నారు ఆలయ అధికారులు.
.