తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ రోజు రోజుకు రంజుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ వారం హారిక, అభిజిత్, అవినాష్, అమ్మ రాజశేఖర్ మరియు మోనాల్లు నామినేట్ కాగా.
వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.ఇదిలా ఉంటే.
నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కెప్టెన్సీ పోటీ దారుల టాస్క్ ఇచ్చారు.అదే `పల్లెకు పోదాం ఛలో ఛలో`.
ఈ టాస్క్లో గ్రామపెద్దగా సోహైల్, అతడి భార్యగా లాస్య, వీరి కూతురిగా అరియానా, సహాయకుడుగా అమ్మ రాజశేఖర్ను బిగ్ బాస్ నియమించారు.
అలాగే అభిజిత్, మోనాల్ వంటమనుషులుగా, అవినాష్ పాన్ షాపు యజమానిగా, మొహబూబ్ పాన్ షాప్ యజమాని తమ్ముడుగా మరియు హారికను పుకార్లు పుట్టించే అమ్మాయిగా ఉండాలని బిగ్ బాస్ తెలిపారు.
అదే సమయంలో హారికకు ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు.ఆమె మూడు హత్యల్ని చేయాల్సి ఉంటుందని.అందులో మొదటిది రాజశేఖర్పై కాఫీ చల్లడం.రెండొవది అవినాష్కి కోపం తెప్పించి అరిచేలా చేయడం.
మూడొవది చంపాలనుకునే వ్యక్తి పేరు లిప్స్టిక్తో విండోపై రాయాలి అని బిగ్ బాస్ వివరించారు.
ఇక టాస్క్ ప్రారంభం కాగానే హారిక ఓ రేంజ్లో పెర్ఫామెన్స్ చేసి అదరగొట్టింది.
మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే.హారిక చాలా యాక్టివ్గా ఉంటూ తన ఆటను పూర్తి చేయాలని చూసింది.
ఇక ముందుగానే కాఫీ కలుపుకున్న హారిక.దాన్ని అమ్మ రాజశేఖర్ మీద పోసేసింది.
అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మాస్టర్, హారిక మధ్య గొడవ అవుతుందని బిగ్ బాస్ భావించాడు.
కానీ, హారిక మాత్రం బిగ్ బాస్ ఊహలకు అందకుండా దిమ్మతిరిగేలా చేసింది.
మాస్టర్పై కాఫీ ఒంపేసిన హారిక చాలా తెలివిగా టాపిక్ను డైవర్ట్ చేసేసి స్మార్ట్ గేమర్ అనిపించుకుంది.పక్కనే ఉన్న అవినాష్కు అనుమానం వచ్చినా.అతడిని కూడా కూల్గా బోల్తా కొట్టించింది.ఇక హారిక సీక్రెట్ టాస్క్ ఆడుతుందని గమనించలేకపోయిన మాస్టర్.
ఆమె బుట్టలో పడి హత్య చేయబడ్డాడు.