దేశంలో కరోనా చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చింది.ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అయినాగాని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మొదటి నుండి మహమ్మారిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే.
పైగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో జనాల్లో కూడా కరోనాపై భయాందోళన పోయింది.ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా నమోదైన కేసుల వివరాలు చూస్తే 9,309 మందికి కరోనా నిర్ధారణ అయింది.ఇదే తరుణంలో 15,858 మంది కరోనా నుండి కోలుకోవటం జరిగింది.
దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య చూసుకుంటే 1,08,80,603కు చేరింది.ఇదే తరుణంలో కోలుకొని డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 1,05,89,230.
మొత్తం కేసుల యాక్టివ్ సంఖ్య చూసుకుంటే 1,35,926.ఇక గడచిన 24 గంటల్లో 87 మంది మృతి చెందటంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,447 కు చేరింది.దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 97.3 శాతంగా ఉంటె, ఇక మరణాల రేటు 1.4 శాతానికి పడిపోయింది.
.