కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో తెలంగాణలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్న సంగతి తెలిసిందే.ప్రభుత్వం కూడా ఏం చేయలేని స్థితిలో.
ఒకానొక సందర్భంలో నెలకొనగా ప్రజలు గవర్నర్ ని ఆశ్రయించడం జరిగింది.అనంతరం కొద్ది తక్కువ టైమ్ లోనే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ ను అరికట్టే రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేయడంతో ప్రస్తుతం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.
తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో వివరాలు చూస్తే గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 101 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు… ఇదే సమయంలో 197 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నాట్లు వివరాల్లో తేలింది.విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య లెక్క చూస్తే 2,95,682 కు చేరుకోగా.2,92,229 మంది రికవరీ అయ్యారు.ఇక, ఇప్పటి వరకు 1611 మంది మృతిచెందారు.
ప్రస్తుతం 1,842 యాక్టివ్ కేసులు ఉండగా.అందులో 751 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని బులెటిన్లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఆదివారం ఒక్కరోజే 18,252 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.