యూత్ స్టార్ నితిన్ భీష్మ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇప్పుడు మరోసారి తనకి అలవాటైన రొమాంటిక్ కామెడీతోనే రంగ్ దే సినిమా చేస్తున్నాడు.వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.
అయితే లాక్ డౌన్ కారణంగా అమెరికాలో షూటింగ్ చేయాల్సిన పార్ట్ పెండింగ్ లో ఉండిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మిగిలిన షూటింగ్ కంప్లీట్ చేయడానికి తాజాగా షూటింగ్ మొదలు పెట్టారు.
అయితే ఈ షూటింగ్ షెడ్యూల్ నిజానికి అమెరికాలో ఉండాలి.కానీ ప్రస్తుతం అక్కడికి వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొని ఉంది.
ఈ నేపధ్యంలో ఆ అమెరికా బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలు కూడా ఇక్కడే షూట్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
దీని కోసం ఏకంగా కోటిన్నరతో ఒక ప్రత్యేకమైన సెట్ ని వేసినట్లు తెలుస్తుంది.
అమెరికా నేటివిటీ కనిపించే విధంగా ఒక హౌస్ సెటప్ వేసి అందులో షూటింగ్ చేస్తారని సమాచారం.చూసిన వాళ్లకి ఇది సెట్ అని అనుమానం రాకుండా సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ లైట్ సెటప్ అంతా దగ్గరుండి చేయించారని తెలుస్తుంది.
ఇండోర్ సన్నివేశాలు అన్ని కూడా ఈ ఇంట్లోనే షూట్ చేసి అవుట్ డోర్ ఫీల్ కోసం అమెరికాలో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది.ప్రస్తుతం టాకీ వర్క్ హైటెక్ సిటీ ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.
దీని తర్వాత ఇటలీ వెళ్లి రెండు పాటలు షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ లోపు అమెరికా సెట్ సిద్ధమవుతుందని, షూటింగ్ గ్యాప్ లేకుండా ఆ ఇంట్లో కీలక సన్నివేశాలు పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది.