ప్రజలు మూఢనమ్మకాలను ఆసరాగా తీసుకొని కొందరు వ్యక్తులు దొంగ బాబాలు గా చలామణి కొనసాగిస్తున్నారు.ఇకపోతే వాళ్ళు సమాజానికి పనికి వచ్చే పనుల కంటే పనికిరాని పనులు ఎక్కువగా చేస్తున్నారు.
బాబా అనే పేరుతో అక్రమ వసూళ్లు మహిళలపై లైంగిక దాడులు లాంటి చర్యలు కూడా ఈ మధ్యకాలంలో చేయడం మనం చూస్తూనే ఉన్నాం.ఇదే నేపథ్యంలోనే ఇప్పటివరకు ఇలా చేసిన అనేక దొంగ బాబాలు ఇప్పటికే జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు.
ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ వ్యక్తి డేరా బాబా అవతారమెత్తాడు.రాష్ట్రంలోని దుబ్బాక మండలం చికోడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి సమర్థ మహారాజ్ అనే పేరుతో తాను స్వామీజీ అని చాటింపు చేస్తున్నాడు.
ఇక అసలు విషయంలోకి వెళితే… ధర్మాజీ పేటకు చెందిన రఘు అనే వ్యక్తి తన చదువు కోకుండా మధ్యలోనే చదువుకోవడం ఇష్టం లేక బాబా అవతారమెత్తాడు.
అయితే రఘు ను బాబా గా నమ్మిన ఓ మహిళ అతడి వద్దకు వచ్చి తాను అమ్మవారి గుడి కట్టాలని సంకల్పిస్తున్నట్టు తెలిపింది.
అయితే ఇదే ఆసరాగా తీసుకొని ఆమెపై దొంగ బాబా కన్నేశాడు.ఇక దీంతో తన శిష్యుడు నరేష్ తో కలిసి సదరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇక ఈ సంఘటనతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ నేపథ్యంలో గురుశిష్యుల పై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు.
దింతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా కేవలం నరేష్ ను మాత్రమే అదుపులోకి తీసుకోగా రఘు పోలీసుల బారి నుండి తప్పించుకున్నాడు.రఘు కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నారు.