గాజులు ఎవరికి కావాలి భూమి ఇవ్వండి భువనేశ్వరి గారు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి కొనసాగాల్సిందే అంటూ తెలుగు దేశం పార్టీ నాయకత్వం మరియు అమరావతి ప్రాంత ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.ప్రభుత్వం రాజధానిగా మూడు ప్రాంతాలను ప్రకటించిన విషయం తెల్సిందే.

 Deputy Cm Pushpa Srivani Comments On Chandrababu Naidu Wife-TeluguStop.com

ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి అంటూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక సమితి ఏర్పాటు అయ్యింది.ఆ సమితి ఆధ్వర్యంలో రాజధాని ప్రాంత రైతులు మరియు ఇతర ప్రాంతాల వారు ఆందోళనలు చేస్తూ ఉంటారు.

ఆ సమితి కోసం చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి విరాళంగా తన చేతికి ఉండే బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు.భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఘాటుగా స్పందించారు.

మీరు ఇవ్వాల్సింది గాజులు కాదు మీ భర్త చంద్రబాబు నాయుడు ఇన్‌ సైడ్‌ ట్రేడింగ్‌ ద్వారా కొట్టి వేసిన భూములను ఇవ్వాలంటూ ఆమె డిమాండ్‌ చేసింది.మీరు అమరావతిలో హెరిటేజ్‌ కోసం కొనుగోలు చేసిన భూముల వివరాలను లెక్కలను తెలియజేయాలంటూ డిమాండ్‌ చేసింది.

మీరు అమరావతి పట్ల ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని.అమరావతి రైతుల జీవితాలను నాశనం చేసింది చంద్రబాబు నాయుడు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube