పశు వైధ్యురాలు ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.నింధితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమయంలో కొందరు ఆమె చేసిన పనిని తప్పుబడుతున్నారు.రాత్రి సమయంలో బయటకు వెళ్లడం ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే నిర్మానుశ ప్రాంతంలో ఎందుకు ఉండాల్సి వచ్చిందని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
అలాంటి చెత్త ప్రశ్నలపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమయంలో డిప్యూటీ సీఎం మహ్ముద్ అలీ కూడా అదే విధంగా స్పందించడం విమర్శల పాలవుతుంది.
ప్రియాంక రెడ్డి మరణంపై స్పందించిన మహ్మద్ అలీ రాత్రి సమయంలో ఆమె చెల్లికి కాకుండా 100 కు కాల్ చేసి ఉంటే బాగుండేది.
ఆమాత్రం కాస్త ఆలోచన లేదా అన్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశాడు.ప్రతి ఒక్కరు 100 నెంబర్కు కాల్ చేయాలని, ఎలాంటి చిన్న లేదా పెద్ద ఆపద ఉన్నా కూడా వెంటనే 100కు కాల్ చేస్తే వెంటనే రెస్పాన్స్ వస్తుందని, ప్రియాంక రెడ్డి కూడా 100కు కాల్ చేసి ఉంటే తప్పకుండా ఆమె బతికి ఉండేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చనిపోయిన ప్రియాంక రెడ్డికి ఇలాంటి సలహాలు ఇప్పుడు అవసరమా అంటూ కొందరు డిప్యూటీ సీఎంపై విమర్శలు చేస్తున్నారు.