జవాద్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఏం ధర్మాన కృష్ణదాస్ .జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జవాద్ తుపాను ప్రత్యేక అధికారి హెచ్.
అరుణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ లతో సహా ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో జవాద్ తుపానుకు తీసుకోవలసిన చర్యల పై ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలు జవాద్ తుపానుకు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని తుపాను వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఏం ధర్మాన కృష్ణదాస్.