విశాఖ కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి హయాంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయి సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తాం విశాఖ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 450 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయి టిడిపి కాలంలో నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఉన్న రోడ్లు ఈ రకంగా తయారయ్యాయని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.రాత్రి రాత్రి రోడ్లు వేయడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదన్నారు కొన్ని పత్రికలు పనిగట్టుకొని పాత ఫోటోలతో రోడ్లు పాడైపోయాయని వార్తలు రాయడం దారుణం అన్నారు.
విశాఖ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వార్డుకు కోటిన్నర రూపాయలు నిధులు కేటాయించారని అందులో అత్యధిక శాతం రోడ్ల నిర్మాణానికి కేటాయించినట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు.