తెలుగుదేశం పార్టీ రెబల్ లీడర్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియనివారు ఉండరు.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దూకుడుగా వ్యవహరించి అనేక వార్తల్లో నిలిచిన చింతమనేని తాజాగా దెందులూరు నియోజకవర్గంలో పర్యటించి రోడ్డు పనులు చేపట్టడం జరిగింది.
దెందులూరు మండలం సోమవారపాడులో రోడ్లపై ఉన్న గుంతలు చింతమనేని ప్రభాకర్ స్వయంగా పూడ్చడం జరిగింది.ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో దెందులూరు రోడ్డు భారీగా దెబ్బతినటం జరిగింది.
ఈ క్రమంలో రేపు రోడ్డు మరమ్మతు పనులు చేయనున్న క్రమములో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా వచ్చి రోడ్లు గుంతలను పూడ్చడంతో … పొలిటికల్ మైలేజ్ కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో.
చింతమనేని ప్రభాకర్ పనులు చేస్తుండగా .
అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు వచ్చి అడ్డుకోవటంతో.రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.
రెండు పార్టీల మధ్య జరుగుతున్న తోపులాట చెదరగొట్టడం జరిగింది.
.