మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి( MLA Marri Rajasekhar Reddy ) విద్యాసంస్థల్లో కూల్చివేతల ప్రక్రియ ఆగింది.ఎంఎల్ఆర్టీఐటీఎం, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో కూల్చివేతలు నిలిచాయి.
అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని( Quthbullapur Constituency ) దుండిగల్ లో చిన్నదామర చెరువును ఆక్రమించి అక్రమంగా భవనాలు నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు వారం రోజుల కిందటే యాజమాన్యానికి నోటీసులు అందజేశారు.
ఈ క్రమంలోనే కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ మరియు పోలీసుల ఆధ్వర్యంలో కూల్చివేతలను నిర్వహించిన సంగతి తెలిసిందే.మరోవైపు మాజీ మంత్రి మల్లారెడ్డి,( Ex Minister Mallareddy ) ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే కూల్చివేతల ప్రక్రియ కోర్టు ఆదేశాలతో నిలిచాయా? లేక కాంగ్రెస్ లో చేరతారనే వార్తల నేపథ్యంలో కూల్చివేతలు నిలిచాయా? అన్న వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.