ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ అమెరికా పెరిగిపోవడానికి కారణం ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని అంటున్నారు అమెరికా డెమోక్రటిక్ నేతలు.ప్రజలని అలెర్ట్ చేయడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమయ్యిందని, కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు.
కరోనా మృతుల సంఖ్య దాదాపు 1300 లకి చేరుకోవడానికి గానీ లేదా పాజిటివ్ కేసులు లక్ష కి చేరుకోవడానికి ట్రంప్ అలసత్వమే కారణమని అంటున్నారు.ఇదిలాఉంటే ఈ విపత్తుని ఊహించి ట్రంప్ కనీసం వైద్య సంభందిత ఉపకరణాలు కూడా సిద్దం చేయలేక పోయారని ఆరోపిస్తున్నారు.
అమెరికా అంతటా మాస్క్ లు, ఐసీయూలు, వైద్య ఉపకరణ పరికరాల కొరత విపరీతంగా ఉందని వీటిని సమకూర్చలేక పోతోంది ట్రంప్ నిర్లక్షం వలనేనని ఆరోపిస్తున్నారు.డెమోక్రటిక్ అధీనంలో ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్లు అయితే ట్రంప్ తీరుపై విరుచుకుపడుతున్నారు.ఇల్లినాయిస్, మిచిగాన్ , రాష్ట్రాల గవర్నర్లు అయితే ట్రంప్ ఓ పనికిమాలిన అధ్యక్షుడు అంటూ బండ బూతులు తిడుతున్నారు.ట్రంప్ చేతగాని తనంతో అమెరికా కరోనా బారిన పడిందని ఈ తప్పులని కప్పిబుచ్చు కోవాడానికి అధ్యక్ష ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని తన వైఫల్యాలని ట్రంప్ కప్పిపెడుతున్నారని విమర్శించారు.
ట్రంప్ ముందు ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టడం మానేసి కార్యాచరణ మొదలు పెట్టు అంటూ ఫుడ్ బాల్ ఆడుకుంటున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు.