హైదరాబాద్ లో దిశ ఉదంతం తర్వాత అమ్మాయిలలో ఓ విధంగా చాలా మార్పు వచ్చింది అని చెప్పాలి.దిశ సంఘటనని ముందు దేశంలో చాలా అత్యాచారాలు, హత్యలు జరిగిన కూడా ఈ సంఘటన స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారలేదు.
ఓ విధంగా చెప్పాలంటే దిశ సంఘటన మీద ఇతర దేశాల మీడియా కూడా దృష్టిపెట్టింది.అంతలా ప్రపంచాన్ని కదిలించిన ఈ సంఘటన తర్వాత ఇండియాలో అమ్మాయిలలో చాలా మార్పు వచ్చింది.
అత్యవసర సమయాలలో ఏమాత్రం సంకోచించకుండా 100 నెంబర్ కి ఫోన్ చేసి పోలీసుల సాయం తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం తన హ్యాండ్ బ్యాగ్స్ లో పెప్పర్ స్ప్రే లు కూడా పెట్టుకోవడం మొదలు పెట్టారు.
ముఖ్యంగా పెప్పర్ స్ప్రేలు ఉపయోగించి అమ్మాయిల సంఖ్య భాగా పెరిగింది.తమను తాము కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా అమ్మాయిలు పెప్పర్ స్ప్రే కొంటున్నారని తెలుస్తుంది.ఈ వారంలోనే అమెజాన్లో పెప్పర్ స్ప్రే సేల్స్ ఏకంగా 700 రెట్లు పెరిగింది.అమ్మాయిలు దీని అవసరం తమకు ఎంతగా ఉందనుకుంటున్నారో ఇది స్పష్టం చేస్తోంది.
అమెజాన్ ఇండియా వెబ్సైట్లో సెక్యూరిటీ అండ్ సేఫ్టీలో సెక్షన్ లో పెప్పర్ స్ప్రేలని ఎక్కువగా ఆర్డర్ చేసుకుంటున్నారు.ఒక్కసారిగా దీనికి డిమాండ్ పెరగడంతో కోబ్రా లాంటి టాప్ పెప్పర్ స్ప్రే బ్రాండ్ అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టాల్సి వచ్చింది.
ఇక ఈ పెప్పర్ స్ప్రేకి తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఘటన లగడపాటి రాజగోపాల్ కి దక్కగా, ఇప్పుడది అమ్మాయిలకి వరంలా మారిందని చెప్పాలి.మొత్తానికి దిశ ఘటన మహిళా లోకానికి తమ తమని తాము రక్షించుకోవడానికి ఒక దిశ చూపించింది అని చెప్పాలి.