ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమాకే సీక్వెల్ రెడీ అయ్యింది.
ఇక మొదటి సినిమా హిట్ తో కేజీఎఫ్2 పై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఆ అంచనాకి తగ్గట్లే కేజీఎఫ్ టీజర్ కూడా ఉంది.
ఇక ఈ సినిమాని మరింత పవర్ ఫుల్ ప్యాక్ మూవీ ప్రశాంత్ నీల్ తెరపై ఆవిష్కరించాడు.స్టార్ క్యాస్టింగ్ ని సినిమా కోసం తీసుకున్నాడు.
సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి స్టార్ నటులు సినిమాలో భాగం అయ్యారు.దీంతో సినిమాకి అన్ని భాషలలో మంచి క్రేజ్ వచ్చింది.
ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసేశారు.మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ దీనికోసం కేటాయించారు.
ఈ నేపధ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది.
ఓవర్సేస్ రైట్స్, తెలుగు, తమిళ్, హిందీ రిలీజ్ రైట్స్, అలాగే డిజిటల్, శాటిలైట్ రైట్స్ విషయంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు.
ఓర్వర్సెస్ కోసం 80 కోట్లు డిమాండ్ చేస్తూ ఉండగా తెలుగు రిలీజ్ కోసం 70 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.అయితే దిల్ రాజు ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం 50 కోట్లు వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.
ఓవరాల్ గా 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కేజీఎఫ్2కి జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే 250 కోట్ల వరకు కలెక్షన్ రావాల్సి ఉంటుంది.
అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే వీలైనంత ఎక్కువగా రాబట్టి సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తున్నారు.