ఆ మధ్య ఢిల్లీలో ఓ ఇంట్లో కుటుంబంలో 11 మంది ఒకే సారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.ఆ ఘటన వెనుక ఏవో కారణాలు ఉన్నాయని ముందుగా భావించిన తరువాత కేవలం మూఢనమ్మకం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు.
అయితే ఒకే కుటుంబంలో అలా 11 మంది చనిపోవడం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.తరువాత కాలంలో చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని, ఈ 11 మంది అందులో దెయ్యాలై తిరుగుతున్నారని నమ్మడం మొదలెట్టారు.
దీంతో ఆఇల్లు ఒక బూత్ బంగ్లాలా మారిపోయింది.ఆ ఇంట్లో ఎవరు దిగడానికి కూడా భయపడేవారు.
అయితే తాజాగా ఒక వ్యక్తి తనకు ఆ ఇల్లు అద్దెకు కావాలని అడగడంతో అందరూ షాక్ అయ్యారు.ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆ ఇంట్లో 11 మంది చనిపోయారని చెప్పిన కూడా అతను పట్టించుకోలేదు.
అసలు చనిపోతే దెయ్యాలు అవుతారనే విషయాన్ని కూడా తాను నమ్మనని, తనకి సరిపోయే బడ్జెట్ తో మంచి ఇల్లు దొరికినపుడు ఎందుకు వదులుకుంటా అని చెప్పాడు.డిసెంబర్ 30న భార్యతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో దిగబోతున్నట్లు తెలిపారు.
మొత్తానికి ఆ ఇంటి వైపు చూడాటానికి కూడా భయపడే వాళ్ళు ఉండగా అతను ఇంట్లో ధైర్యంగా దిగడానికి ప్రయత్నించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.