ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రమూకలు రెచ్చిపోతున్న వేళ దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగొచ్చని ఇంటలిజన్స్ బ్యూరో హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తనఖీలు నిర్వహించారు.ఉగ్రవాదులుగా అనుమానిస్తూ సుమారు 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చేసిన దాడుల్లో అనుమానంగా కనిపించడంతో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అదుపులోకి తీసుకున్న 8మందికి ఉగ్ర మూకలతో సంబంధం ఉందా.? అనే అంశంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ముంబై లో జరిగిన మారణ దాడి మరచిపోక ముందరే ఈ రకమైన పరిస్థితి ఏర్పడడం తో కంగారు పడుతున్నారు లోకల్ జనాలు.
కనీస భద్రత లేకుండా పోవడం పదే పదే ఇంటలిజెన్స్ నుంచి వార్నింగ్ లు రావడం తో వారు భద్రత విషయాల లో ఇబ్బందులు ఎదురుకొంటున్నారు .