ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.మున్సిపాలిటీలో ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్థాంతరంగా ముగిసింది.ఓటింగ్ హక్కుల అంశంలో లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చేపట్టడంతో ఎన్నికను వాయిదా వేశారు.
కాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 15 సంవత్సరాలు తర్వాత బీజేపీ తన ఆధిపత్యాన్ని కోల్పోయిందన్న విషయం తెలిసిందే.