ప్రస్తుత సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో మనం బతుకుతున్నాం.సమాజంలో రోజు రోజుకు దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి.
ప్రియురాలిని చంపి అదే రోజు పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డ ఘటన మన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళితే ఢిల్లీలోని మిత్రాన్ గ్రామంలో నివాసం ఉంటున్న దాబా నిర్వాహకుడు సాహిల్ గహ్లోత్ (24) , తన ప్రియురాలి గొంతును కేబుల్ వైర్ తో గట్టిగా బిగించి చంపేశాడు.
ఎవరికి అనుమానం రాకుండా ఫ్రిజ్ లో మృతదేహాన్ని దాచి ఉంచి అదే రోజు మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు దాబాలోని ఫ్రిడ్జ్ లో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, సాహిల్ గహ్లోత్ ను అరెస్టు చేశారు.ఇక పోలీసుల విచారణలో తాను వేరే అమ్మాయిను వివాహం చేసుకుంటున్న విషయం ప్రియురాలుకు చెప్పకుండా దాచి ఉంచానని, ఈ విషయం తెలిసిన తరువాత ప్రియురాలుకు,
తనకు మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు.ఇదే క్రమంలో ఈ నెల 9వ తేదీ కూడా తమ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని నిందితుడు వెల్లడించాడు.ఎంత సర్ది చెప్పినా ప్రియురాలు వినకపోవడంతో ఏం చేయాలో తెలియక అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ డేటా కేబుల్ వైర్ తో ప్రియురాలు గొంతు నొక్కి చంపి, ఈ విషయం బయటపడకుండా భద్రంగా ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్ లో భద్రపరిచానని చెప్పాడు.
అయితే పోలీసుల విచారణలో మొదట తనకు ఎటువంటి సంబంధం లేదు అనే విధంగా, కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు.కానీ పోలీసులు తమ స్టైల్ లో విచారణ చేయడంతో తానే ప్రియురాలను హత్య చేసి రిఫ్రిజిరేటర్ లో దాచిన విషయం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడని ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ చెప్పారు.