ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ వ్యాపారవేత్తల మెడలకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.అక్రమ నగదు లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
దీనిలో భాగంగా వెన్నమనేని శ్రీనివాసరావును ఢిల్లీకి రావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు అందించారు.అదేవిధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరి కొంతమందికి కూడా నోటీసులు అందించింది.
అయితే నేడు ఢిల్లీలో ఈడీ విచారణకు వెన్నమనేని హాజరుకానున్నారు.మరోవైపు లిక్కర్ స్కామ్ లో నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.