మందుబాబులు మద్యం కోసం పడే పాట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.మద్యం కోసం వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
మందుబాబులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుంటాయి.కానీ ఢిల్లీ సర్కార్ మాత్రం మందుబాబులకు అదిరిపోయే ఆఫర్ ఒకటి ప్రకటించింది.
అయితే ఇదేమీ ఊరికే ఇవ్వమని ఢిల్లీ సర్కార్ పేర్కొంది.విదేశాల నుండి ఇండియాకు పట్టుకువచ్చే మద్యం బాటిళ్లకు సంబంధించి సరైన ఆధారాలు లేనివాటిని ప్రభుత్వ అధికారులు సీజ్ చేస్తారనే విషయం తెలిసిందే.
ఆ సీజ్ చేసిన బాటిళ్లను ఇప్పుడు ప్రభుత్వం విక్రయించనుంది.అయితే వాటిపై 25 శాతం డిస్కౌంట్ కూడా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో ఫారిన్ సరుకు చుక్క అయినా రుచి చూడాలనుకునే మందు బాబులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలిని చూస్తున్నారు.అయితే విదేశాల నుండి దిగుమతి చేసిన మద్యం నికార్సయినదా కాదా అని చూశాకే ప్రభుత్వ అధికారులు దానిని వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా ఫారిన్ మందు కోసం మందు బాబులు ఢిల్లీ సర్కార్కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.