రాత్రి పది దాటింది.ఒంటిరిగా ఒక పదిహేడేళ్ల అమ్మయి మార్కేట్ కి ఏదో పని మీద వెళ్ళింది.
కొంత సమయం తరువాత తిరిగి వస్తుండుగా, ఎలాంటి సడిచప్పుడు లేని ఒక వీధినుంచి వెళుతోంది.ఇంతలో మూడు మగ పురుగులు అక్కడికి వచ్చాయి.
ఆ అమ్మాయివైపు చాలా తేడాగా చూస్తున్నాయి ఆ ముగ్గరి కళ్ళు.అమ్మాయికి అనుమానం రానే వచ్చింది.
ఊహించినట్టుగానే ముగ్గురు ఓకేసారి ఎగబడి ఆ అమ్మాయి నడుం పట్టుకున్నారు.అయితే ఆ టీనేజర్ అందరిలా హెల్ప్ హెల్ప్ అని అరవలేదు.
నిద్రలోకి జారుకున్న జనాలు, తనకోసం వచ్చి ఆదుకుంటారు అన్న నమ్మకం లేదేమో.సొంతంగానే వారిని ఆటాడుకుంది.
ఎవరు ఊహించలేని ఉపాయంతో తరిమికొట్టింది.ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది?
ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టింది, గట్టిగా, విచిత్రంగా.కళ్ళు బాగా తెరిచి ముగ్గరి వంక అదోలా చూడటం, నోటికి వచ్చిందేదో మాట్లాడటం, జుట్టంతా ముఖం మీద వేసుకోని ఏదో దెయ్యం ఆవహించినట్లుగా ప్రవర్తించింది ఆ అమ్మాయి.
ఇద్దరు పారిపోయారు భయంతో.
ఒక్కడు మిగిలాడు.వెంటనే వాడిని గోళ్ళతో గీరేసింది.
ఆ రక్తాన్ని తన మొహానికి రాసుకోని, ఏదో ప్రేతాత్మ ఆవహించినదానిలా చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది.ఇంకేం … ఉన్న ఆ ఒక్కడు కూడా వణికిపోయి పారిపోయాడు.
అచ్చం సినిమా సన్నివేశంలా ఉన్న ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది.పేరు బయటపెట్టలేదు కాని, ఖ్యాతి ఖండేల్వాల్ అనే అమ్మాయి తన స్నేహితురాలు చేసిన ఈ తెలివైన పనిని తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసింది.