రైతు గొప్ప మనసు.. వలస కార్మికులకు విమాన టికెట్లు!

కొందరు తమ ఉద్యోగులను కుటుంబసభ్యులుగా చుసుకుంటున్నాం అని అంటారు కానీ అవి కేవలం మాటలకే పరిమితం ఉంటుంది.కానీ కొందరు మాటలు కాదు చేతలలో చూపిస్తారు.

 Delhi Farmer Buys Flight Tickets For Workers,delhi Farmer, Flight Tickets, 10 Wo-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అతను ఓ రైతు.

పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్నాడు.అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కావడంతో అతని వద్ద పని చేస్తున్న వలస కార్మికులను సొంత రాష్ట్రం బీహార్ కు విమానంలో పంపాడు.

ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ ని క్రమంగా ఎత్తివేయడంతో అతను వారిని తిరిగి పనిలో చేర్చుకునేందుకు వారికి మరోసారి టికెట్లు బుక్ చేశాడు.ఆ రైతు పేరు పప్పన్ సింగ్.

మూడు ఎకరాల్లో పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నాడు.ఇక ఆ కార్మికుల టికెట్ల కోసం అతను ఏకంగా లక్ష రూపాయిల వరకు ఖర్చు చేశాడు.

అతని కార్మికులు పాట్నా నుంచి ఆగస్టు 27న ఢిల్లీకి చేరుకుంటారని అతను తెలిపాడు.

కాగా అతను గత 25 ఏళ్ల నుంచి ఈ పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్నట్టు కార్మికులందరినీ కుటుంబసభ్యులుగా భావిస్తున్నట్టు తెలిపాడు.

ప్రస్తుతం పుట్టగొడుగుల సీజన్ ప్రారంభం అవుతుందని అందుకే జీవనోపాధి కోసం ఢిల్లీకి వచ్చేందుకు పది మందికి విమాన టికెట్లు బుక్‌ చేసినట్టు పప్పన్ సింగ్ తెలిపాడు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube