ఓటమిపై కిరణ్ బేడీ కొత్త కారణం !!

డిల్లీ ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీ జీర్ణించుకోలేకపోతున్నారు… నిన్న ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు…అందులో ఆమె తన ఆవేదన తెలియజేస్తూ ఇలా అన్నారు…తాను ఎన్నికల రాజకీయ పరీక్షలో ఓడిపోయానని చెప్పారు.తన ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అన్నారు.

 Kiran Bedi Comments On Her Lost In Delhi-TeluguStop.com

శక్తివంచన లేకుండా విజయం కోసం తాను కృషి చేశానని చెప్పారు.తన పట్ల చేసిన ఘాటైన వ్యాఖ్యలు వినేందుకు తన తల్లిదండ్రులు జీవించి లేరని చెప్పారు.

తాను ఎన్నికల్లో పాల్గొంది తనకు అధికారం కోసం కాదన్నారు.ఢిల్లీకి సేవ చేసేందుకు ఎన్నికల బరిలో దిగానని చెప్పారు.

తాను 40 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నానని చెప్పారు.ఈ నగరంలో తాను ఎన్నో సవాళ్లను చూశానని చెప్పారు.

మహిళల రక్షణ కోసం తాను తనవంతు చేశానని చెప్పారు.అంతేకాకుండా అంతర్గతంగా తాను ఓడినట్లుగా భావించడం లేదన్నారు.

తక్కువ సమయం దొరికిందని అభిప్రాయపడ్డారు.అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సవాల్‌ను స్వీకరించేందుకు ముందుకు రారన్నారు.

ఇదే క్రమంలో ఆమె తాను చేసిన సోషియల్ సర్విస్ గురించి సైతం వివరించారు.ఏది ఏమైనా డిల్లీ ఎన్నికలు పాపం కిరణ్ బేడీకు పీడ కలనే మిగిల్చాయి అని అనుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube