డిల్లీ ఎన్నికల్లో ఓటమిని బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడీ జీర్ణించుకోలేకపోతున్నారు… నిన్న ఆమె దేశ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాశారు…అందులో ఆమె తన ఆవేదన తెలియజేస్తూ ఇలా అన్నారు…తాను ఎన్నికల రాజకీయ పరీక్షలో ఓడిపోయానని చెప్పారు.తన ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అన్నారు.
శక్తివంచన లేకుండా విజయం కోసం తాను కృషి చేశానని చెప్పారు.తన పట్ల చేసిన ఘాటైన వ్యాఖ్యలు వినేందుకు తన తల్లిదండ్రులు జీవించి లేరని చెప్పారు.
తాను ఎన్నికల్లో పాల్గొంది తనకు అధికారం కోసం కాదన్నారు.ఢిల్లీకి సేవ చేసేందుకు ఎన్నికల బరిలో దిగానని చెప్పారు.
తాను 40 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నానని చెప్పారు.ఈ నగరంలో తాను ఎన్నో సవాళ్లను చూశానని చెప్పారు.
మహిళల రక్షణ కోసం తాను తనవంతు చేశానని చెప్పారు.అంతేకాకుండా అంతర్గతంగా తాను ఓడినట్లుగా భావించడం లేదన్నారు.
తక్కువ సమయం దొరికిందని అభిప్రాయపడ్డారు.అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సవాల్ను స్వీకరించేందుకు ముందుకు రారన్నారు.
ఇదే క్రమంలో ఆమె తాను చేసిన సోషియల్ సర్విస్ గురించి సైతం వివరించారు.ఏది ఏమైనా డిల్లీ ఎన్నికలు పాపం కిరణ్ బేడీకు పీడ కలనే మిగిల్చాయి అని అనుకోవాలి.