తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఢిల్లీ పెద్దలు సీరియస్..!!

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం బీజేపీ పార్టీ గెలవటం తెలిసిందే.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీలోని అంతర్గత విభేదాలు వచ్చే రీతిలో ఫలితాలు వచ్చిన తర్వాత కామెంట్లు చేయడం జరిగింది.

 Delhi Elders Are Serious About Telangana Congress Leaders Details,  Delhi,telang-TeluguStop.com

ఇక ఇదే తరుణంలో బిజెపి పార్టీ హుజురాబాద్ క్యాండెట్ ఈటెల రాజేందర్ ని రేవంత్ రెడ్డి ఆ సమయంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికలలో వ్యవహరించిన తీరుపై సీరియస్ అయినట్లు సమాచారం.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం మరింత దారుణంగా ఈ ఉప ఎన్నికలలో పడిపోవడంతో.తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పెద్దలు పిలవడం జరిగిందట.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఈనెల 13వ తారీఖున ఉదయం 10 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఓట్ల శాతం ఎందుకు.తగ్గింది అనేదానిపై ప్రశ్నించనునట్లు సమాచారం.

ఈ ఉప ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి తో పాటు పీసీసీ చీఫ్, సీఎల్పీ లీడర్… ఏఐసీసీ కార్యదర్శి ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పెద్దలు తెలియజేయడం జరిగింది.మొత్తం హుజురాబాద్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఓ నివేదిక తయారు చేసి తీసుకురావాలని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలియజేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube