దేశంలోని ప్రధాన సమస్య బాలీవుడ్ నటి రియానేనా అంటూ ప్రశ్నించిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్లేస్ ని భర్తీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది.అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ బలహీనపడ్డ రాష్ట్రాలలో పాగా వేయాలని తీవ్రంగా శ్రమిస్తుంది.

 Manish Sisodia Sensational Comments On Rhea Case, Delhi Deputy Chief Minister Ma-TeluguStop.com

ఇలాంటి టైంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్ర ప్రభుత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం.

కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, సరిహద్దులలో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీటి నుండి ప్రజల ఆటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం,కొన్ని మీడియా మాధ్యమాలతో కలిసి సుశాంత్ సింగ్ కేసును వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం భారత దేశం ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి రియా మరియు ఆమె కుటుంబ సభ్యులను దోషులుగా చూపడానికి కేంద్రం,కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించడం వింతగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా చైనా ఆక్రమించుకున్న మన భూభాగాలను విడిచి పెట్టేసింది, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లు కు చేరింది,స్వచ్ భారత్, డిజిటల్ స్కిల్ ఇండియా విజయవంతమయ్యాయి, యువతకి కోట్లల్లో ఉద్యోగాలు వచ్చాయి.

ఇక మన దేశంలో మిగిలింది కేవలం రియా చక్రబర్తి, ఆమె కుటుంబం అరెస్టు మాత్రమే కాదా! అంటూ వ్యంగ్రాస్తాలు సంధించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube