కరోనాతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్నా కూడా వైధ్య ఇంకా పోలీసు శాఖ మాత్రం నిరంతరాయంగా కష్టపడుతూనే ఉన్నారు.ఎన్ని విధాలుగా వారి సేవ అవసరం ఉంటుందో అన్ని విధాలుగా కూడా వారి సేవలను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.
ఈసమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న వైధ్యులకు కూడా కరోనా సోకినట్లుగా ఇప్పటికే మనం చూశాం.
ఈ సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.కరోనాపై పోరాడుతున్న వైధ్య ఇంకా పోలీసు శాఖ ఉద్యోగుల్లో ఎవరైనా కరోనాతో మృతి చెందితే వారి కుటుంబాలకు కోటి రూపాయల వరకు ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.
వారు చేస్తున్న ఈ పోరాటం మామూలుది కాదని, వారి జీవితాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు కనుక కోటి రూపాయలు వారికి ఇవ్వడం తక్కువే అనుకుంటున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.