గణతంత్ర దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక నుండి ఢిల్లీలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉంటాయి.
ఇతర ఏ రాజకీయ నాయకుని ఫోటోలు, ముఖ్యమంత్రుల ఫోటోలు పెట్టకూడదు అని నిర్ణయం తీసుకోబడింది.అంటూ స్పష్టం చేశారు.
దీంతో కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ చాలా చోట్ల పోటీ పడుతూ ఉంది.
పంజాబ్ రాష్ట్రంలో అయితే ఏకంగా గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.ఇటువంటి తరుణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో మరియు భగత్ సింగ్ ఫోటోలు మాత్రమే ఉండాలని గణతంత్ర దినోత్సవ ప్రారంభ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.ఢిల్లీలో జరిగిన వేడుకలకు.
ప్రధాని మోడీ, రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు