కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్ర బడ్జెట్ ప్రస్తుతం రూ.40 లక్షల కోట్లకు చేరుకుందన్నారు.అందులో దాదాపు రూ.10 లక్షల కోట్లు బడా వ్యాపారవేత్తలు, వారి స్నేహితుల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్రం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.పెద్ద కంపెనీలకు సైతం రూ.5 లక్షల కోట్లను మాఫీ చేసిందని విమర్శించారు.కార్పొరేట్ సంపన్నుల రుణాలను రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని మండిపడ్డారు.అదేవిధంగా సైనికులకు పెన్షన్ చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని సాకులు చెబుతోందని ఎద్దేవా చేశారు.
పేద ప్రజలు బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని దుయ్యబట్టారు.