దేశ రాజధాని ఢిల్లీలో ప్రాణవాయువు కరువైంది.కరోనా రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ లేకపోవడంతో ఈమధ్యకాలంలోనే ఢిల్లీ హాస్పిటల్స్ లో అనేక మరణాలు సంభవించాయి.
ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ లో సీనియర్ డాక్టర్ తో సహా 12 మంది కోవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయారు.జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో కూడా ఆక్సిజన్ కొరత వల్లే 20 మంది మృతిచెందారు.
సర్ గంగారం హాస్పిటల్ లో కూడా పాతికమంది దాకా ప్రాణాలు విడిచారని సమాచారం.ఢిల్లీలో కరోనా పేషెంట్స్ ఆక్సిజన్ లేక ప్రాణాలతో పోరాడుతున్నారు.
ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడిగిన విషయం తెలిసిందే.ఫైనల్ గా ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిచిందని తెలుస్తుంది.ఢిల్లీ ప్రజలకు ఆక్సిజన్ సరఫరా అందించడంతో సిఎం కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం ఢిల్లీ కి ఆక్సిజన్ అందడంతో ప్రధానమంత్రికి లేఖ రాశారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని.రోజువారీ ప్రాతిపదికన ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించాలని కోరుతూ తొలిసారి ఢిల్లీకి 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందని లేఖలో రాశారు కేజ్రీవాల్.
ప్రతిరోజూ ఇదేవిధంగా ఇంత మొత్తం ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు.ఢిల్లీ ప్రజల తరపున ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్.