ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం..!!

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.భయంకరంగా కేసులు బయటపడటంతో పాటు… కరోనా బారిన పడిన రోగులు.

 Delhi Chief Minister's Sensational Decision , Delhi, Keejriwal-TeluguStop.com

వైద్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు విడిచే పరిస్థితి.ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వైరస్ కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ అమలులోకి తీసుకు రావడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.నెలరోజుల్లోగా 44 ఆక్సిజన్ ప్లాంట్ లు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

వీటిలో ఎనిమిది కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు, మిగిలిన 36 ప్లాంట్లను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో 21 ప్లాంట్లు ఫ్రాన్స్ దేశం నుండి వస్తున్నాయని, మిగిలిన 15 ప్లాంట్లు స్వదేశంలోనివి అని  తెలిపారు.

ఏదిఏమైనా రాబోయే రోజుల్లో ఢిల్లీలో ఆక్సిజన్ కొరత లేకుండా మాత్రం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం చాలా సరైనది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube