రానున్న మరో పది రోజుల్లో బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఇండియన్ ప్రీమియర్ లీగ్” మొదలు కానుంది.దీంతో అప్పుడే సోషల్ మీడియా మాధ్యమాలలో హంగామా షురూ అయింది.
ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొనబోయేటువంటి జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి తరలి వెళ్ళాయి.అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ లో పాల్గొంటున్న సౌత్ ఆఫ్రికా దేశ ఆటగాడు ఫాస్ట్ బౌలర్ రబాడా ఓ ఇంగ్లీష్ పత్రికా నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొని తమ జట్టు ఈ సారి ఐపీఎల్ కప్పు సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
అంతేకాక మంచి నైపుణ్యం సామర్థ్యం కలిగినటువంటి యువ ఆటగాళ్లతో తమ జట్టు చాలా పటిష్టంగా ఉందని గత ఏడాది మాదిరిగానే తమ జోరుని కొనసాగిస్తూ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు.కాగా ఈ నెల 20వ తారీఖున ఢిల్లీ క్యాపిటల్స్ తన మొదటి మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో తలపడనుంది.
అయితే ఇక ఈ జట్టు విషయాకొస్తే బ్యాటింగ్ విభాగంలో అజింక్య రహానే, శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వి షా, శ్రేయస్ అయ్యర్, అలెక్స్ కారీ, రిషబ్ పంత్, తదితరులతో బాగానే పటిష్టంగా ఉంది.ఇక బౌలింగ్ ఈ విభాగంలో ఇశాంత్ శర్మ, రబాడ, రవిచంద్రన్ అశ్విన్, మోహిత్ శర్మ, మార్కస్ స్టాయినస్, అక్షర్ పటేల్ తదితరులతో ఈ విభాగం కూడా కొంతమేర బలంగా ఉందని చెప్పవచ్చు.
.