ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవుదామనుకున్న చాలా మందు భామలకి అక్కడ అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు.దీంతో డబ్బు సంపాదన కోసం వారు తమ శరీరాన్ని అవకాశంగా వాడుకొని సోషల్ మీడియాని ఉపయోగించుకొని రెచ్చిపోతున్నారు.
సెలబ్రిటీ అంటే ఆటోమేటిక్ గా ఫాలోయింగ్ ఉంటుంది.ఇక ఒకటి రెండు సినిమాలలో నటించి అందాల ప్రదర్శనలో ఎలాంటి అడ్డు లేకుండా చూపించే వారికి ఇంకా ఎక్కువ ఫలోవర్స్ ఉంటారు.
ఇప్పుడు సినిమా అవకాశాలు లేని అందాల భామలకి ఈ అందమే ఆదాయం తెచ్చిపెడుతుంది.తమ హాట్, సెమీ న్యూడ్ ఫోటోలని సోషల్ మీడియాలో తన ఎకౌంటు ద్వారా షేర్ చేస్తూ అందులో వాటి ద్వారా ఆదాయం రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇలా సంపాదిస్తున్న వారిలో ఈషా గుప్తా ముందు వరుసలో ఉంటుంది.
అయితే ఇన్స్టాగ్రామ్ లో అంగాంగ ప్రదర్శనలతో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న ఈ భామ మీద ఇప్పుడు ఓ వ్యాపారవేత్త పరువునష్టం దావా వేసారు.
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్ విజ్ ఈషా గుప్తా తనపై చేసిన లైంగిక ఆరోపణలు చేసిందని న్యూఢిల్లీలోని సాకేత్ కోర్టులో కేసు దాఖలు చేశారు.తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆమెని శిక్షించి తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరాడు.
దీనిపై న్యాయస్థానం విచారణనుకి ఆదేశించింది.ఈ నెల 6వ తేదీన ఈషా తన ట్విట్టర్ అకౌంట్లో వరుస ట్వీట్లు చేస్తూ రోహిత్ విజ్ చూపుల్తోనే తనను అత్యాచారం చేసినట్లు పేర్కొంది.
అతను నాతో మాట్లాడలేదు, తాకలేదు.కానీ రాత్రంతా తదేకంగా చూస్తూనే ఉన్నాడు.
తన చూపుల్తోనే అసౌకర్యానికి గురిచేశాడు.ఆడదానిగా పుట్టడం ఇంత శాపమా, ఇలాంటి వాళ్ళ నుంచి సమాజంలో ఆడవాళ్ళని ఎవరు రక్షిస్తారు అంటూ అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేసింది.
దీంతో ఆ వ్యక్తి ఇప్పుడు ఈషా గుప్తా మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకున్నాడు.