ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈసారి కూడా ఖాతా తెరిచే అవకాశం లేదనిపిస్తుంది.ఎగ్జిట్ పోల్స్లో మూడు నుండి అయిదు వరకు స్థానాలు కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
కాని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కాంగ్రెస్ అందుకోలేక పోతుంది.ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఆధిక్యంలో లేకపోవడంతో హస్తినలో కాంగ్రెస్కు మరోసారి పరాభవం తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా అక్కడ పోటీ కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి మరియు బీజేపీకి మద్య ఉంది.ఈ రెండు పార్టీల మద్య హోరా హోరీ అనుకున్నా తుది పోరులో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ముందు ఉంది.
కాంగ్రెస్కు చుక్కలు చూపించి, బీజేపీని మట్టి కరిపించి ఆప్ నాయకులు జెండా ఎగురవేసుకుంటూ మళ్లీ అధికారం దక్కించుకోబోతున్నారు.సాయంత్రం వరకు తుది ఫలితాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.
అప్పటి వరకు కూడా కాంగ్రెస్ ఏమైనా అద్బుతం సాధిస్తుందనే నమ్మకం ఎవరికి లేదు.సున్నాతోనే ఈసారి కూడా ఎన్నికల్లో పరాభవం చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు.