ఢిల్లీలో మద్యం విక్రయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.దేశ రాజధానిలో మద్యం షాపుల్లో భారీ రాయితీలు ఇస్తున్నారు.
దీంతో ఢిల్లీలోని మద్యం షాపుల వద్ద రద్దీ నెలకొనడంతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు.ఢిల్లీలో చీప్ లిక్కర్ అందుబాటులో ఉండటంతో ఉత్తరప్రదేశ్వాసులు కూడా ఢిల్లీ వచ్చి మద్యం కొనుగోలు చేస్తున్నారు.
దీంతో ఢిల్లీకి ఆనుకుని ఉన్న నగరాల్లో మద్యం విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీ నుంచి మద్యం తీసుకెళ్లడంపై నిబంధనలు పెట్టాలని యోచిస్తున్నారని భోగట్టా.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఢిల్లీ నుంచి ఒక్క మద్యం సీసా మాత్రమే తీసుకువచ్చేందుకు అనుమతి ఉంది.ఇక్కడ మరో షరతు ఏమిటంటే ఈ బాటిల్ సీల్ తెరిచి ఉండాలి.
బాటిల్ సీలు వేసివుంటే చర్యలు తీసుకుంటారు.ఉత్తరప్రదేశ్లో స్మగ్లింగ్ ఘటనలను తగ్గించేందుకు ఈ నిబంధన అమలు చేస్తున్నారు.ఢిల్లీలోని మద్యం షాపుల్లో ఎందుకు డిస్కౌంట్లు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన తర్వాత దుకాణదారులకు ధరలో తగ్గింపు ఇచ్చారు.
దీంతో దుకాణదారులు తమ తగ్గింపును వినియోగదారులకు అందిస్తున్నారు.ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం లాక్డౌన్ సమయంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే తాము డిస్కౌంట్ ఇస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు.
లాక్ డౌన్ సమయంలో దుకాణాలు మూసివేయాల్సి రావడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు.
అందుకే ఇప్పుడు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నా మంటున్నారు.ఇటీవలికాలంలో మద్యం షాపుల్లో వినియోగదారులకు ఒక మద్యం బాటిల్కు మరొక బాటిల్ను ఉచితంగా అందజేస్తుండగా, కొన్ని బ్రాండ్లలో రెండు బాటిళ్ల కొనుగోలుకు ఒక బాటిల్ను ఉచితంగా ఇస్తున్నారు.ఆమధ్య ప్రభుత్వం మద్యం విక్రయాలపై అనేక ఆంక్షలు విధించింది.
ఢిల్లీలో దుకాణదారులు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నకారణంగా దుకాణాల వద్ద రద్దీ ఏర్పడింది.దీంతో ఢిల్లీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది.
ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విభాగం ఏప్రిల్ ప్రారంభంలో మళ్లీ వీటికి సడలింపునిచ్చింది.మద్యం బాటిళ్లపై 25 శాతం వరకు తగ్గింపు ఇవ్వాలని దుకాణదారులను కోరింది.