ఐపీఎల్-2020 కీలక దశకు చేరుకుంది.ప్రస్తుతం ప్లేఆఫ్స్ జోరు కొనసాగుతుండగా.
ఇప్పటికే ముంబై ఇండియన్స్ తొలుత ప్లేఆఫ్స్కు చేరుకుంది.అయితే ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరగ్గా.ఈ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది.6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.దీంతో ఢిల్లీ ప్లేఆఫ్స్కు చేరుకోగా.రన్రేట్ పరంగా ఓడిన బెంగళూరు జట్టు కూడా ప్లేఆఫ్స్కు చేరుకుంది.దీంతో ఇప్పటివరకు మూడు జట్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి.
అయితే ప్లేఆఫ్స్కి చేరుకునే నాలుగో జట్టు ఏదనేది రేపటితో తేలనుంది.
ప్రస్తుతం నాలుగో స్థానంలో కోల్ కతా నైట్రైడర్స్ ఉండగా.రేపు సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే.ఆ జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది.ఒకవేళ ముంబై ఇండియన్స్ గెలిస్తే.హైదరాబాద్ నుంచి టోర్నీ నుంచి బయటికి వెళ్లినుంది.అప్పుడు కోల్ కతా ప్లేఆఫ్స్కు అర్హత సాధించనుంది.
రేపు జరగనున్న మ్యాచ్తో ప్లేఆఫ్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ వెళుతుందా?.లేదా కోల్ కతా వెళుతుందా? అనేది తేలుతోంది.దీంతో రేపటి జరగనన్న మ్యాచ్పై ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మరి ప్లేఆఫ్స్కు వెళ్లే నాలుగో జట్టు ఏంటీ అనేది చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.