టాలీవుడ్ జక్కన్న రాజమౌళిపై ప్రేక్షకులు కాస్త కోపంగా ఉన్నారు.‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల కాగానే రెండవ పార్ట్ను ప్రారంభిస్తాను అని మాట ఇచ్చిన జక్కన్న, ఆ మాటను తుంగలో తొక్కాడు.
ముందుగా అనుకున్న దాని కంటే కూడా దాదాపు నెల రోజులు ఆలస్యంగా ‘బాహుబలి’ రెండవ పార్ట్ పనులు మొదలు అయ్యాయి.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి’ రెండవ పార్ట్ను వచ్చే సంవత్సరం చివర్లో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.
‘బాహుబలి’ మొదటి పార్ట్ విడుదల అవ్వక ముందు రెండవ పార్ట్ను వచ్చే సంవత్సరం జులైలో విడుదల చేస్తాం అంటూ రాజమౌళి చెప్పాడు.అయితే మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో రెండవ పార్ట్పై నమ్మకం ప్రేక్షకుల్లో భారీగా ఉంది.
దాంతో ఆ నమ్మకాన్ని నిలుపుకునేందుకు మరింతగా కష్ట పడాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాజమౌళి మెల్లగా ఈ సినిమాను తెరకెక్కించాలని, అలాగే బాలీవుడ్ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నాడు.దాంతో ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
రెండవ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అందుకే జక్కన్నపై కోపంతో ఉన్నారు.