ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరువు ప్రతిష్టలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భంగం కలిగించారు.ఆయన ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు.
బాబు గౌరవాన్ని కాలరాశారు…ఇదీ విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బి ఉమామహేశ్వరరావు వాదన.ఈయన కేసీఆర్పై విశాఖపట్నం నాయ్యస్థానంలో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
ఓటుకు నోటు కేసులో ఉద్దేశపూర్వకంగానే బాబు పరువుకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు.అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాద్ కూడా మరో పిటిషన్ వేశారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి బాబు పరువుకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.బాబు ఆడియో టేపు విడుదల చేయగానే ఈ పరువు నష్టం కేసులు దాఖలయ్యాయి.
బాబు గొంతును మిమిక్రీ చేశారని కొందరు చెబుతుండగా, ఒకవేళ బాబే మాట్లాడినా అందులో తప్పేమీ లేదన్నారు.ఫోన్ సంభాషణలో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు.టీడీపీకే ఓటు వేయాలని కూడా అడగలేదు.‘మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి’ అని బాబు అన్నారు.డబ్బు గురించిన ప్రస్తావన లేదు కాబట్టి బాబు నేరం చేయలేదని టీడీపీ నాయకుల వాదన.బాబు ఫోన్ ట్యాప్ చేశారని, ఈ నేరం చేసినందుకు కేసీఆర్ను కోర్టుకు లాగుతామని అంటున్నారు.
ఈ యుద్ధం ఎంతవరకు పోతుందో తెలియదు.