బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తాడు.చాలా వరకు తన వ్యక్తిగత విషయాలు బాగా బయటపడి వైరల్ అవుతుంటాయి.
అంతేకాకుండా అవి పోలీసులు, కోర్టుల వరకూ కూడా వెళ్తుంటాయి.ఇదిలా ఉంటే తాజాగా తనపై వచ్చిన పరువు నష్టం గురించి వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
ముంబైలో పన్వేల్ ప్రాంతంలో సల్మాన్ ఖాన్ కు ఫామ్ హౌస్ ఉంది.ఇక దాని పక్కనే ఉన్న ఓ స్థలాన్ని ఖేతన్ కక్కడ్ అనే ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు.
ఇక ఆయన గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా.అందులో సల్మాన్ ఖాన్ పైన అంతేకాకుండా తన ఫామ్ హౌస్ పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
దీంతో సల్మాన్ ఖాన్ అతడు చేసిన వ్యాఖ్యలతో తనకు పరువు నష్టం కలిగిందని.దీంతో భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు నుండి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరాడు.
అంతేకాకుండా ఇంటర్వ్యూ భాగంలో అతడు చేసిన పరువునష్టం వ్యాఖ్యలు ఎలాగైనా తొలగించాలని సల్మాన్ ఖాన్ ముంబై సిటీ సివిల్ కోర్టులో కోరి పరువు నష్టం కేసు వేశాడు.
కానీ కోర్టు మాత్రం ఈ పిటిషన్ ను తిరస్కరించింది.ఖేతన్ పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోర్టు తెలిపింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణ కోసం కోర్టు ఈ సమావేశాన్ని ఈనెల 21న వాయిదా వేయటం జరిగింది.