తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది.ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 7 గురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.
ఫినాలే టికెట్ సాధించడానికి ఆటను రసవత్తరంగా ఆడుతున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కుటుంబ సభ్యులకు దశలవారీగా టాస్క్ లను పెడుతున్నారు .నిన్నటి ఎపిసోడ్ లో ఐస్ గేమ్ తో ఇంటి సభ్యులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.అయితే టబ్బులో కాళ్ళు పెట్టి ఉండాలని మధ్యలో కాలు బయటకు తీయవచ్చని సూచించాడు బిగ్ బాస్.
ఈ టాస్క్ ముగిసేసరికి హౌస్ మేట్స్ కాళ్లు కదపలేని స్థితికి చేరుకున్నారు.ఈ టాస్క్ లో భాగంగా శ్రీ రామచంద్ర, షణ్ముఖ్, సిరి కాళ్ళు వాపులు వచ్చాయి.
అయితే టాస్క్ అయిపోయాక ఎవరు వేడి నీళ్లు ఉపయోగించొద్దు అని బిగ్ బాస్ చెప్పినా కూడా వాటిని పట్టించుకోకుండా ప్రియాంక శ్రీరామచంద్రకు సహాయం చేయడానికి అతడి కాళ్లపై వేడి నీళ్లు చల్లి, నూనెతో మర్దన కూడా చేసింది.దీంతో చివరికి శ్రీరామచంద్ర నడవలేని పరిస్థితి చేరుకున్నాడు.
అనంతరం బిగ్ బాస్ డాక్టర్ ని హౌస్ లోకి పంపించి శ్రీ రామచంద్రను మెడికల్ రూమ్ కి తీసుకువెళ్లి, కాళ్లకు కట్లు కట్టి పంపించాడు.
ఇక శ్రీరామచంద్ర పరిస్థితి చూసి సన్నీ కూడా బాధ పడ్డాడు.శ్రీ రామచంద్రకు సహాయం గా ఉంటూ అతడు నవ్విస్తున్నాడు.అయితే శ్రీరామచంద్ర త్వరగా కోలుకోవాలని షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునయన శ్రీరామ్ కు సపోర్ట్ ఇచ్చింది.
మోర్ పవర్ టు యు అంటూ దీప్తి శ్రీరామ్ కు దీప్తి మద్దతును ప్రకటించింది.అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియ సైతం శ్రీరామచంద్ర పరిస్థితి చూసి ఎమోషనల్ అయ్యింది.