టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలాంటి ట్వీట్ లు చేస్తాడో అంచనా వేయడం చాలా కష్టం.ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదాస్పద ట్వీట్ లతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటాడు.
అయితే వర్మ చేసే ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తాడు? ట్వీట్లు ఎందుకు చేస్తాడు? అన్న విషయాలు ఎవరికీ అంతుచిక్కవు.ఇక వర్మ చేసే ట్వీట్ల పై కొందరు సెటైర్లు వేస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా నిన్న రాత్రి ఈరోజు ఉదయం రామ్ గోపాల్ వర్మ వరుసగా ట్వీట్ లు చేస్తూ వచ్చాడు.
ఇక ఆ ట్వీట్ లు నెటిజన్స్ ని ఆకట్టుకున్నాయి.
ప్రస్తుత కాలంలో నిజాలు చెప్పే మనుషులను.ద్వేషిస్తున్నారు అబద్ధాలు చెప్పేవారిని ప్రేమిస్తున్నారు.
వచ్చిన సమస్య అదే అంటూ ఒక ట్వీట్ చేశాడు.ఇక మరొక ట్వీట్ లో మనుషులంతా కూడా అబద్ధాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఎందుకంటే అవి నిజాలతో పోల్చుకుంటే కంఫర్ట్ గా ఉంటాయి.నిజం బట్టలిప్పి అందరినీ నగ్నంగా నిలబెడుతుంది.
అబద్దాలు వాటిని కవర్ చేస్తూ ఉంటాయి కదా అన్నట్టుగా మరొక ట్వీట్లు చేశారు.రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన కు నచ్చినట్టు ఉన్నాయి.
అందుకే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లను పోస్టు చేసింది.
రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ లను దీప్తి సునైనా పోస్ట్ చేయడం చూస్తుంటే ఆ పోస్టులు షణ్ముఖ్ జస్వంత్ కి సెటైరికల్ గా వేసినట్లు అనిపిస్తోంది.దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ నీ ఉద్దేశించే ట్వీట్లు పోస్ట్ చేసింది అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ దూరంగా పెడుతోంది.
కానీ షణ్ముఖ్ జస్వంత్ మాత్రం దీప్తి సునయన తో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన విడిపోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.