టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నాగ చైతన్య తో బ్రేకప్ అయ్యింది.పెళ్లి చేసుకుని ఇద్దరు సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు… దంపతులు అంటే ఇలా ఉండాలి అనుకుంటూ ఉండగా అనూహ్యంగా వీరిద్దరు ఇలా బ్రేకప్ అవ్వడం.
విడాకులు తీసుకునేందుకు సిద్దం అవ్వడం ప్రతి ఒక్క అభిమాని గుండెను పగలకొట్టినంత పని చేసింది. నాగ చైతన్య మరియు సమంతల విడాకుల విషయం ప్రతి ఒక్కరిని కదిలించింది.
వారిద్దరి వ్యవహారం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో చర్చ జరిగిన బ్రేకప్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా దీప్తి సునైన మరియు షన్నూలదే అనడంలో సందేహం లేదు.వీరిద్దరు అయిదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
పలు వేదికల మీద మేము పెళ్లి చేసుకుంటున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.అంతగా ప్రేమించుకున్న వారిద్దరి మద్య వచ్చిన గొడవలు విడి పోయే వరకు తెచ్చాయి.
మళ్లీ ఇద్దరు కలుస్తారని అంతా ఆశ పడ్డారు.కాని వారిద్దరు మళ్లీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు.వారు ఇద్దరు కూడా ఇప్పటికే చాలా దూరం వెళ్లి పోయారు.దాంతో వారి కలయిక అసాధ్యం.సమంత బ్రేకప్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.వర్క్ తో బిజీ అయ్యి ఆ బ్రేకప్ నుండి బయట పడుతుంది.
ఇప్పుడు అదే విధంగా దీప్తి సునైన కూడా బ్రేకప్ బాధను తట్టుకునేందుకు సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతుంది.అదే సమయంలో ఆమె వరుసగా ఏదో ఒక ప్రాజెక్ట్ ను చేసేందుకు సిద్దం అవుతుంది.
యూట్యూబ్ లో ఆమె కవర్ సాంగ్స్ మరియు వెబ్ సిరీస్ లు మంచి ఆధరణ దక్కించుకున్నాయి.కనుక మళ్లీ వాటిని చేసేందుకు గాను దీప్తి ప్రయత్నాలు చేస్తుంది.
మొత్తంగా షన్నూ ను మర్చి పోయేందుకు గాను దీప్తి పనిలో బిజీగా ఉంటుంది.సమంత కూడా చైతూ ను మర్చి పోయేందుకు అలా వర్క్ లో బిజీగా ఉంటుందని మనం ఈమద్య మాట్లాడుకోవడం జరిగింది.