హీరో సుశాంత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే డ్రగ్స్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తి అరెస్ట్ అయ్యారు.
ఎన్సీబీ అధికారులు కేసును విచారిస్తున్న సందర్భంగా బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు గా కొందరికి డ్రగ్స్ సరఫరా కేసులో సంబంధం ఉన్నట్లుగా ఎన్సీబీ కి సమాచారం అందింది.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే తో పాటు పలువురు హీరోయిన్స్ కు విచారణకు హాజరు కావాలంటూ ఎన్సీబీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
అధికారులు పంపించిన సమన్లపై హీరోయిన్ దీపికా పదుకొనే స్పందించింది.తనకు సమన్లు అందినట్లుగా దీపిక సమాధానం ఇచ్చారు.ఆమె విచారణకు హాజరు అవుతాను అంటూ ఎన్సీబీ అధికారులకు తెలియజేసిందట.ఆమెను విచారించిన తర్వాత అధికారులు ఆమెను అదుపులోకి తీసుకునే ది లేనిది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆమెతో పాటు ఇటీవల నోటీసులు అందుకున్న హీరోయిన్స్ విచారించిన తర్వాత మరింత మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.