బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.ఈయన నటిస్తున్న సినిమాల్లో జవాన్ ఒకటి.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.
మొదటిసారి ఈమె ఈ పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.
ఇక ఈ సినిమాలో నయనతార మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా భాగం కానుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఖాన్ కు జోడీగా నయనతార మాత్రమే కాకుండా దీపికా కూడా వీరి మధ్యకు రాబోతుందని తెలుస్తుంది.దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో మెరవనుంది.
అయితే ఈమెది అతిధి పాత్ర అయినా కూడా ఈ సినిమాకు ఎంతో కీలకం అని అందుకే ఈమె వెంటనే ఒప్పేసుకుందని టాక్.
ప్రెసెంట్ దీపికా తో అట్లీ చర్చలు జరుపు తున్నారట.
షారుఖ్ ఖాన్ కూడా ఇటీవలే దీపికా ను హైదరాబాద్ ఫిలిం సిటీలో కలిసారని వార్తలు వస్తున్నాయి.దీపికా ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో భాగంగా అక్కడ ఉండగా.
షారుఖ్ ఖాన్ కూడా అవాన్ షూటింగ్ కోసం ఫిలిం సిటీ వెళ్లగా ఈమెతో ఈ పాత్ర కోసం మాట్లాడారట.వీరిద్దరూ ఇప్పటికే చెన్నై ఎక్స్ ప్రెస్ లో నటించి మెప్పించి సూపర్ హిట్ జోడీ అనిపించు కున్నారు.
ఇక వీరు ఇద్దరు కలిసి పఠాన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ఇప్పుడు జవాన్ కోసం అతిథి పాత్ర లో నటించాలని అడిగారట.దీంతో ఈమె కూడా సానుకూలంగానే స్పందించి ఈ పాత్రకు ఓకే చెప్పారట.ఇక దీపికా షెడ్యూల్ తేదీలు కూడా లాక్ చేసి ఈమెను ఫిక్స్ చేశారట.ఈ వారంలోనే ఈ డీల్ లాక్ చేయనున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి ఈ అమ్మడు సినిమాలో ఉంది అని ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో చూడాలి.
ఇక ఈ సినిమాలో మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నాడు అని తెలుస్తుంది.