డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఈ సినిమాకి సంబందించిన గ్రౌండ్ వర్క్ ని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ పూర్తి చేశాడు.
సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేయనున్నారు.ఇక ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకునేని ఇప్పటికే ఫైనల్ చేశారు.
అయితే ఇప్పుడు దీపికాతో చిత్ర యూనిట్ కి కొత్త సమస్యలు వస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ సినిమా విషయంలో ఆమె రెండు ఆలోచనలతో ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.
ఈ సినిమా కోసం నిర్మాత అశ్వినీదత్ దీపికా పదుకునేకి అడ్వాన్స్ పంపించగా దానిని ఆమె తిరస్కరించిందని సమాచారం.సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రెమ్యునరేషన్ తీసుకుంటానని నిర్మాతకి చెప్పినట్లు వినిపిస్తుంది.
అయితే ఇలా ఆమె అడ్వాన్స్ తిరస్కరించడం వెనుక వేరే కారణం ఉందనే చర్చ ఇప్పుడు మొదలైంది.
దీపికా ప్రస్తుతం నాగ్ అశ్విన్ కి చేస్తానని డేట్స్ ఇచ్చిన కూడా ఆ సమయంలో షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా కమిట్ అయ్యి ఉందని, ఒక వేళ ఈ రెండు సినిమాలు షూటింగ్ ఒకేసారి పడితే మొదటి ప్రయారిటీ షారుఖ్ ఖాన్ సినిమాకి ఇవ్వాలని ఆమె అనుకుంటున్నట్లు బి-టౌన్ లో చెప్పుకుంటున్నారు.
అందులో ఆమె అడ్వాన్స్ తిరస్కరించిందని ప్రచారం జరుగుతుంది.అదే సమయంలో ఆమె ఈ సినిమా విషయంలో కాస్తా ఇగో చూపిస్తుందని, ప్రభాస్ తో సమానంగా తనకి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు ఇప్పుడు అడ్వాన్స్ తీసుకోలేదని కూడా చెబుతున్నారు.
గతంలో ఓ వార్తపై కూడా ఆమె స్పందిస్తూ తాను నటిస్తున్న సినిమాలో ప్రభాస్ కో స్టార్ మాత్రమే తప్ప నా సినిమా టైటిల్ ప్రభాస్ కాదని వెటకారంగా సమాధానం చెప్పింది.ఈ నేపధ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో కొంత గ్యాప్ దీపికాకి ఉందని టాక్ నడుస్తుంది.
ఇలాంటి పరిస్థితిలో దీపికా విషయంపై నాగ్ అశ్విన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి.