స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే బాలీవుడ్లో పలు సక్సెస్ఫుల్ చిత్రాలతో తనదైన మార్క్ను సాధించింది.స్టార్ హీరోయిన్గా దాదాపు అందరు హీరోలతో నటించిన ఈ బ్యూటీ, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ జంట ఒక్కటవ్వడంతో వారి ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఇక పెళ్లి తరువాత కూడా ఇద్దరు పలు సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
కాగా వీరిద్దరి వ్యక్తిగత జీవితంలో గుడ్ న్యూస్ ఎప్పుడెప్పుడు వింటామా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే దీపికా తాజాగా ఓ ఫోటోను షేర్ చేయడంతో ఆమె అభిమానుల్లో ఆతృత మొదలైంది.
మామిడికాయలకు కాస్త మిర్చి పొడి వేసిన ఫోటోను దీపికా షేర్ చేసింది.ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా దీపికా కూడా ఇంటికే పరిమితం అయ్యి భర్తతో హాయిగా గడుపుతోంది.
కాగా తన భర్తకు సరొకత్త రుచులతో వంటకాలు చేసి వడ్డిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమె పచ్చి మామిడికాయలకు కారం పెట్టి ఓ ఫోటోను తీసి పోస్ట్ చేసింది.
దీంతో ఆమె తల్లి కాబోతుందా అనే డౌట్ అందరిలో నెలకొంది.దీపికా ఫ్యాన్స్ ఆమెను ఇదే విషయంపై ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
కానీ దీపికా, రణ్వీర్లు మాత్రం ఎలాంటి బదులు ఇవ్వలేదు.దీంతో నిజంగానే దీపికా తల్లి కాబోతుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ మామిడికాయ ఫోటో వెనుక అసలు కథ ఏమిటో తెలియాలంటే మాత్రం దీపికా నోరు విప్పాల్సిందే.