ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే, దక్షిణాదిలో మత కలహలు, మత అల్లర్లు తక్కువే.తల నరికేస్తాం, ముక్కు కోసేస్తాం లాంటి అనాగరిక వ్యాఖ్యలు చేసే మతోన్మాదలు ఇక్కడ లేరు కూడా.కాని బాలివుడ్ నెం.1 హీరోయిన్ దీపికా పడుకోణె హైదరాబాద్ రావడానికి భయపడుతోంది.అదేంటి, తెలుగువారు ఏం చేసారు అని అనుకుంటున్నారా? తెలుగు వారు ఏమి చేయలేదు.కాని దీపికాకి బయటకు రావడానికే చాలట్లేదు
పద్మావతి అనే సినిమా గురించి ఈమధ్య తెగ విని ఉంటారుగా.
పద్మావతి అనే రాణి అసలు నిజంగానే చరిత్రలో ఉండిందా, లేదా ఆమె కేవలం ఒక కల్పిత పాత్రేనా అనే మీమాంస కాసేపు పక్కనపెడితే, సినిమా చూడకుండానే, ఈ సినిమా మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు రాజ్ పుత్ కుల సంఘాలు మరియు కొన్ని మతసంఘాలు.ఎంత దిగువకు దిగజారారు అంటే, దీపికా ముక్కు కోస్తే కోటి రూపాయలు, సజీవంగా దహిస్తే 5 కోట్ల రూపాయలు అంటూ నజరానాలు ప్రకటిస్తున్నారు.
ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడం చాలా దూరపు విషయం, అసలు బీజేపి నాయకులు కూడా దీపికాతో పాటు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి తల నరికితే 10 కోట్లు ఇస్తాం అంటూ గొడవలని ప్రోత్సహిస్తోంటే
ఈ నెల 28-30 తేదిల్లలో హైదరాబాదులో “Global Entrepreneurship Summit” జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సమ్మిట్ లో పాల్గొనటానికి ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ రానుండగా, ప్రపంచ నలుమూలల నుండి వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
దీపికా పడుకోణె కి కూడా ఆహ్వానం అందగా, దీపికా ఈ ఈవెంట్ లో పాల్గోనేది అనుమానంగా మారింది.కారణం, మతోన్మాదల భయం.